నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 5: గత కొన్నిరోజులుగా రికార్డులు సృష్టించిన పత్తి ధర బుధవారం రూ.10 వేలను దాటింది. అంతర్జాతీ య మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగడంతోపా టు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటం తో ధరలు పరుగులు తీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో క్వింటాల్ ధర ఏకంగా రూ. 10,200కు చేరింది. కనిష్ఠంగా రూ.9,500 ద క్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా ల్కు రూ.10 వేలు పలికింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాపారులు క్వింటాల్కు రూ.9,999 చెల్లించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్కు అత్యధికంగా రూ.9,705 పలికింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ గరిష్ఠంగా రూ.9,801 దక్కింది. పత్తి ధర రూ.10 వేలు దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం మార్కెట్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ చిత్రపటాలకు పత్తితో అభిషేకం చేశారు.