వరంగల్: మార్కెట్లో పత్తి ధర (Cotton price) రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది. ఎనుమాములలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కొన్నిరోజులు క్రితం ఇక్కడ క్వింటాలు పత్తి రూ.12,110కు అమ్ముడుపోయింది. తాజాగా అది ఈరోజు బ్రేక్ అయింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన రైతు అవదూత శ్రీనివాస్ 42 బస్తాల పత్తిని మార్కెట్కు తీసుకొచ్చాడు. దీంతో ఎనుమాముల మార్కెట్లోని ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ.12,130 చొప్పున కొనుగోలు చేశారు.