జూబ్లీహిల్స్,ఫిబ్రవరి19 : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి సోమవారం నాడు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. హైదరాబాద్ నగరంలోని మాసబ్ట్యాంక్ పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కే జగజ్యోతి బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్ బొడు కం గంగన్న నుంచి 84వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గంగన్న ఫిర్యా దు మేరకు ఏసీబీ అధికారులు లంచం తీసుకొంటున్న ఆమెను సోమవారం అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు.