హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో విశిష్ఠ సేవలు అందించిన రవాణాశాఖ డిప్యూటీ కమిషర్ (విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటీ, అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ పాపారావును ‘కరోనా వారియర్ అంతర్జాతీయ అవారు’్డ వరించింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ శుక్రవారం ఈ అవార్డును ప్రకటించింది. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాపారావు వివిధ రాష్ర్టాల నుంచి తెలంగాణకు ఆక్సిజన్ను రప్పించడంలో కీలకంగా పనిచేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రవాణాశాఖ తరఫున 50 వేలమంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కరోనా టీకాలు ఇప్పించేలా చొరవ తీసుకున్నారు. ఆయనకు త్వరలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపక సీఈవో సత్యవోలు రాంబాబు వెల్లడించారు.