హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరింది. వీరిలో 32 మంది ఒమిక్రాన్ బాధితులు ఇప్పటికే కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 274 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలల్లో మొత్తం 227 మంది కరోనా బాధితులు కోలుకోగా.. ఒకరు కరోనా కారణంగా మృతి చెందినట్లు ఈ బులెటిన్ వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 3,779 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ మొత్తం 21,679 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 274 మందికి పాజిటివ్ ఫలితం వచ్చినట్లు తెలియజేశారు.