హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధా న పట్టణాలు గల జిల్లాలతోపాటు సరిహద్దు జిల్లాల్లోని వైద్యాధికారులను అప్రమత్తంచేసింది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం నిర్ధారణ పరీక్షల సంఖ్యను 50 వేలకు పెంచాలని ఆదేశించారు. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 50,998 నమూనాలను పరీక్షించగా, 228 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికం గా జీహెచ్ఎంసీలో 46 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరిలో 15, కరీంనగర్, ఆదిలాబాద్లో 9 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నదని, వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. కొంతమంది నిర్లక్ష్యం వల్లే ఇటీవల కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అవకాశం ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 298 కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. మొన్నటి వరకు 100 నుంచి 200 వరకు నమోదైన కేసులు గడిచిన 24 గంటల్లో 300 వరకు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా శనివారం 19,559 మందికి తొలిడోస్ వేసినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో పేర్కొన్నది. ఇందులో 753 మంది హెల్త్ కేర్ వర్కర్లు, 474 మంది ఫ్రంట్లైన్ వారియర్లు, 10,539 మంది 60 ఏండ్లు పైబడినవారు, 7,793 మంది 45 నుంచి 59 ఏండ్ల మధ్యవారు ఉన్నట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 5.27 లక్షలకు చేరుకోగా, రెండో డోస్ తీసుకున్నవారి సంఖ్య 2.22 లక్షలకు చేరినట్టు వివరించింది.
అంశం శనివారం మొత్తం
కేసులు 228 3,01,161
రికవరీ 152 2,97,515
మరణాలు 1 1,653
యాక్టివ్ కేసులు – 1,993