జోగులాంబ గద్వాల : సూపర్ స్ప్రెడర్స్కు కరోనా వ్యాక్సిన్ వేయించడంతో కరోనా కట్టడికి అవకాశం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సూపర్ స్ప్రెడర్స్కు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గద్వాల ఏరియా దవాఖానలో వ్యాక్సిన్ పంపిణీని జరుగుతుందన్నారు.
నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు, రేషన్ షాప్ డీలర్స్, తదితరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఇస్తుందన్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా వైరస్ చైన్ను తెంచడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, ఆర్డీఓ రాములు, డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్, టీఆర్ఎస్ సీనియర్ నేత సురేష్ శెట్టి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
నమీబియాలో ఊచకోతకు పాల్పడ్డాం : జర్మనీ