హైదరాబాద్ : అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు నగరంలోని పారమౌంట్ కాలనీని సుమారు నాలుగు వందల మంది వెస్ట్జోన్ పోలీసులు చుట్టుముట్టి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని సోదా చేశారు.
వీసా గడువు ముగిసి ఇక్కడే ఉంటున్న ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
సరైనా ధ్రువపత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న వివిధ దేశాలకు చెందిన 41 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు.వారిని విచారిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని వీరిలో ఇద్దరు గతంలో డ్రగ్స్ క్రయవిక్రయాలకు పాల్పడినట్టు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
హుక్కా కన్జ్యూమ్ చేసే నలుగురిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 25 వాహనాలను సీజ్ చేశామని, ఇందులో మూడు కార్లు, ఒక ఆటో, 21 బైకులు ఉన్నాయని వివరించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంపు పోలీసులు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ను కూడా ఇన్వాల్వ్ చేశామని డీసీపీ తెలిపారు.