జూరాలకు కొనసాగుతున్న ప్రవాహం
మెండోరా, అక్టోబర్ 1 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పడుతున్నది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 2,81,305 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు 33 వరద గేట్ల ద్వారా దిగువకు 2,24,910 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు వెళ్తున్నాయి. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రం 1087.70 అడుగుల (75.465 టీఎంసీలు) వదంద నీటినిల్వ ఉన్నది. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 480.551 టీఎంసీల వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. జూరాల జలాశయానికి 72 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 66,658 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా సాయంత్రానికి 8.830 టీఎంసీలు నిల్వ ఉన్నది. శ్రీశైలం రిజర్వాయర్కు 85,213 క్యూసెక్కులు ప్రవాహం వస్తున్నది. అవుట్ఫ్లో 62,540 క్యూసెక్కులు నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 883 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ 207.41 టీఎంసీలు నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు.