సంగారెడ్డి : ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలుండగా ప్రస్తుతం 29.768 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి 22,067 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు రెండు స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.