నల్లగొండ : చిట్యాల మున్సిపాలిటీలో రూ. 2 కోట్లతో అన్ని హంగులతో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడుతామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సమీకృత మార్కెట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు ఎకరాల్లో రెండు కోట్లతో వెజ్ దుకాణాలు 26, పండ్లు, పూలు దుకాణాలు 8, నాన్వెజ్ 14 దుకాణాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత మార్కెట్ నిర్మించున్నట్లు ఆయన తెలిపారు.
వినియోగదారులకు అన్నిరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, ఇతర వస్తువులు ఒకేచోట లభించేలా సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహాయ, సహకారాలతో మార్కెట్ను అధునాతన హంగులతో నిర్మిస్తామని ఆయన వివరించారు.