జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ సోమవారం పరిశీలించారు. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో గోడౌన్ ల నిర్మాణాలు పూర్తయ్యాయని, భూపాలపల్లి, ములుగు, నారాయణపేటలలో నిర్మాణాలు సెప్టెంబర్లో పూర్తవుతాయని తెలిపారు.
అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాలలో గోడౌన్ ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారని పేర్కొన్నారు. ఆయన వెంట కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎలక్షన్ డీటీ రవికుమార్, ఆర్డీవో శ్రీనివాస్ ఉన్నారు.