మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 18 : మహబూబ్నగర్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గురువారం నుం చి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 25 వరకు ఉదయం 11గంటల నుంచి సా యంత్రం 3 గంటల వరకు నామినేషన్లను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 21న ఆదివారం మినహాయించి ఏ డు రోజులు పాటు స్వీకరణ ఉంటుందని, 26న నా మినేషన్ల పరిశీలన, 29న అభ్యర్థుల ఉపసంహరణ కు అవకాశం, మే 13న పోలింగ్ నిర్వహిస్తామని పే ర్కొన్నారు. అలాగే జూన్ 4న పాలమూరు యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫామ్-26లో అన్ని వివరాలను పూరించాలని తెలిపారు. ఎ న్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా జిల్లాలో ని ఏడు నియోజకవర్గాల్లో 56 టీంలు పర్యవేక్షణలో, 213 సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. సాక్ష్యం యాప్లో పేరు నమోదు చేసుకుంటే, వీల్ చైర్తో పాటు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పట్టుబడ డబ్బును జిల్లా గ్రీవెన్స్ ఆధీనంలో ఉంచుతారని, ఎన్నికలకు సంబం ధం లేనివాటిని గ్రీవెన్స్ కమిటీ ద్వారా తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. సువిధ ద్వారా ఆన్లైన్లో దరఖా స్తు చేసుకున్న వారి వాహనాలకు అనుమతి పొందవచ్చని, ఎన్నికల నిబంధన ఉల్లంఘనపై సీ-విజల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో 16లక్షల 80వేల మంది ఓటర్లు ఉన్నారని, 1,916 పో లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పర్యవేక్షణ కు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేం ద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్ పాల్గ్గొన్నారు.