సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన
చిక్కడపల్లి, మార్చి 6: కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. మతోన్మాద వ్యతిరేక శక్తులన్నీ కలిసి నరేంద్రమోదీ సర్కారుపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. ‘మొదుగు పూలు’ ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంపాదకుడు సతీశ్ చంద్ర, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, రచయిత విజయ భారతి, ప్రొఫెసర్ ఖాసిం, బహుజన తాత్వకుడు కదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.