హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. శుక్రవారం సచివాలయంలో సీఎస్ను కలిసి సంఘం నేతలు హెల్త్కార్డులు, పీఆర్సీ వంటి వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సీఎస్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, ఉపేందర్రెడ్డి, జగన్మోహన్రా వు, వెంకటయ్య, ఎంబీ కృష్ణాయాదవ్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
హైదరాబాద్లో ‘బ్రిక్స్’ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
హైదరాబాద్,జూలై 3 (నమస్తే తెలంగాణ) : బ్రిక్స్ దేశాల కూటమి ట్రేడ్ యూనియన్ సమ్మిట్కు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వనున్నది. ఈనెల 14 నుంచి 16 వరకు మారియట్ హోటల్లో ని ర్వహించే ఈ సమ్మిట్కు బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక సంఘాల నే తలు హాజరుకానున్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్రోడ్స్లో దత్తో పం త్ ఠేంగ్డి భవన్లో మాజీ గవర్నర్ బండారు కార్యక్రమాన్ని ప్రా రం భించారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, సౌత్ ఆఫ్రికా వంటి 14 దే శాల నుంచి 50 మంది విదేశీ ప్రతినిధులు, మన దేశం నుంచి 70 మంది జాతీయ కార్మిక సంఘ నేతలు సమ్మిట్లో పాల్గొంటారు.