కేదార్నాథ్, జూన్ 19: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో బంగారు తాపడం ఏర్పాటులో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బంగారు తాపడం పనులతో తమకేమీ సంబంధం లేదన్నారు. దాత తన వ్యక్తిగత స్వర్ణకారుల సాయంతో తాపడం పనులు చేయించారని చెప్పారు. పురావస్తు శాఖకు చెందిన నిపుణులు పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత బిల్లులు సైతం దాత తన వ్యక్తిగత స్వర్ణకారుడి ద్వారానే సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు.