మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం కూడా భారీగా చేరారు. మర్రిగూడ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు కట్కూరి వెంకటేశ్గౌడ్, ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, లెంకలపల్లి సర్పంచ్ పాక నగేశ్యాదవ్, సరంపేట సర్పంచ్ వెనమల్ల వెంకటమ్మమధుకర్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారంతో రాజీనామా చేసి బీజేపీ ఇచ్చిన రూ.22 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడని విమర్శించారు. మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలుసుకొని రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కాగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మహమ్మదాబాద్ ఉప సర్పంచ్ మాధురీసమరసింహారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, వార్డు మెంబర్ నల్లబోతు చైతన్యయాదవ్ కూడా మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే మండలంలోని కడపగండితండా కాంగ్రెస్ ఉప సర్పంచ్ కరంటోతు లచ్చిరాంనాయక్, వార్డు సభ్యుడు రమావత్ భాస్కర్నాయక్ తదితరులు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 17 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కాగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని అల్లందేవిచెర్వుకు చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు సుర్వి జంగయ్యగౌడ్, నాయకులు ఏర్పుల దశరథ, ఏర్పుల రాములు తదితరులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.