కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మళ్లీ బయటపడింది. ఈ ఏడాది మే 24వ తేదీన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో మదన్ మోహన్రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్గా మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జిగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కొనసాగుతున్నారు.