Kodangal | కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొమ్రాస్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్ రెడ్డి స్వస్థలం కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామం.
బాల్ రెడ్డి మాటల్లోనే.. నేను రైతును.. అసెంబ్లీకి నన్ను పిలవండి మాట్లాడుతాను. నేను నాలుగు ఎకరాలు నాటు వేశాను. దానికి అప్పు తీసుకొచ్చాను. మరి అప్పు తెచ్చి పెట్టినాక మరి వాన్ని అప్పు వానికి ఇయ్యాల్నా..? లేదా..? రైతుబంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మి ఏది లేదు.. అన్ని తీసేసిండ్రు. రైతులను బోడగా చేసిండ్రు. రైతులకు చాలా ఘోరం జరుగుతున్నది. అప్పుడు ఏం చేయలేదు.. ఇప్పుడు ఏం చేయడు. గెలిచినాక ఒక్కనాడైనా కొడంగల్కు వచ్చిండా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. 50, 60 ఏండ్లు పరిపాలన చేసి ఏం చేసిండ్రు.. ఇప్పుడేం చేస్తరు వాళ్లు..? డిసెంబర్ 9న రైతుబంధు రూ. 15 వేలు పడుతదని చెప్పిండ్రు.. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు.. ఏది లేదు. ఆ ఝూటాకు నమ్మి ఓట్లు వేసిండ్రు.. ఇది ఝూటా అని రైతు బాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024