Kadiyam Srihari | హామీల అమలులో కాంగ్రెస్ విఫలమయ్యిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. గృహలక్ష్మీ పథకం రద్దుతో లక్షలాది మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రెండో విడబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని.. కానీ కాంగ్రెస్ దళితబంధును పట్టించుకోవడం లేదన్నారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారని. ఇంకా ఇవ్వలేదని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే దాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయని అన్నారు.
ఎలాంటి అవగాహన లేకుండానే మంత్రులు మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మోసపూరిత ప్రకటనలు చేయడం కాంగ్రెస్ మానుకోవాలని హితవుపలికారు. నమ్మి ఓటేసిన యువతకు కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని విమర్శించారు.