హైదరాబాద్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. ఈనేపథ్యంలో రాజ్భవన్లో అధికారులు ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నగరంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం అంతా కలిసి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలువనున్నారు.
ఇక సీఎల్పీ సమావేశానికి ముందు హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి బ్రదర్స్తో వివిధ అంశాలపై చర్చించారు.