జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్, పలువురు వార్డు మెంబర్లు, యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజాప్రతినిధులకు, నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమయ్యామని, అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు. ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ, సీనియర్ నాయకులు సచిన్రెడ్డి, సంజీవరెడ్డి, సంపత్, సురేందర్, ఐలయ్య, సమ్మిరెడ్డి, భాస్కర్తో పాటు 100మంది ఉన్నారు.