Namasthe Telangana | జూబ్లీహిల్స్, మార్చి9: ‘గురుశిష్యుల రహస్య భేటీ’ శీర్షికతో శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, సీఎం రేవంత్రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, ఆ వార్త ప్రచురించిన దినపత్రికపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో 154/2024యూఎస్, 505(1) (బి) (సి), 505 (2) ఆర్/ డబ్లూ, 109 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.