హనుమకొండ, ఆగస్టు 28 : రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
హనుమకొండలోని మంత్రి నివాసంలో వారికి గులాబీ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎప్పటికి టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని అన్నారు.
సుశిక్షితులైన పార్టీ శ్రేణులు, అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. దేశంలో టీఆర్ఎస్ లాంటి పార్టీ ఎక్కడా లేదన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. అంతా కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల మంత్రి సూచించారు.
పార్టీలో చేరినవారిలో.. కోలుకొండకు చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ గనుపాక విజయ, 9వ వార్డు సభ్యురాలు కొడిశాల ఎల్లమ్మ, గనుపాక ఏసయ్య, గనుపాక ఎల్లయ్య, పల్లాటి రాములు, పసులాది పరశురాములు, పాస్టర్ గనుపాక లాజర్, మాచర్ల నవీన్, మాచర్ల అశోక్, మాచర్ల శ్రీకాంత్, మాచర్ల నర్సయ్య, మాచర్ల సుమలత, జలగం కళావతి, గనుపాక వెంకటమ్మ తదితరులు ఉన్నారు.