కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar)లో కాంగ్రెస్ నాయకులు(Congress leaders) అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా పాలన(Prajapalana) దరఖాస్తులను తామే స్వీకరిస్తామంటూ అధికారులతో వాగ్వాదాని(Conflict)కి దిగారు. వివరాల్లోకి వెళ్తే..బుధవారం కరీనంగర్ పట్టణం ఐదో డివిజన్ బాంబే స్కూల్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అలజడి సృష్టించారు.
ఇన్ని రోజులు సాఫీగా సాగుతున్న కార్యక్రమాన్ని తామే చేపడుతామంటూ గందరగోళం సృష్టించారు. అధికారులు, పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తాము స్టేజీపై కూర్చుంటామంటూ నానాహంగామా చేశారు. పోలీసులతో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. కాంగ్రెస్ నాయకుల అహంకారపూరిత వైఖరిపై ప్రజలు మండిపడ్డారు.