ఏటూరునాగారం, మే 28: ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఇదేరోజు మంత్రి సీ తక్క ప్రెస్మీట్ ఉండటంతో దానిని కూడా బహిష్కరించారు. ఏటూరునాగారంలో ఓ బాలికను ఓ పార్టీకి చెందిన యువనేత లోబర్చుకున్నట్టు పలు పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితమయ్యాయి.
కాగా, ఈ కథనాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులను బెదిరించారు. తాము సదరు జర్నలిస్టుల ఇండ్లను మహిళలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల బె దిరింపు పోస్టులు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.