జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారం అండతో బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి(Jayashankar district) జిల్లాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ(BRS flexes)ని తొలగించి తన వక్రబుద్ధిని చాటుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన పర్మినెంట్ పోల్స్కు ఫ్లెక్సీని కట్టారు. అయితే ఇదే ఫ్లెక్సీ పై కాంగ్రెస్ నాయకులు బుధవారం ఫ్లెక్సీ కట్టారు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులతో ఫ్లెక్సీని తీసివేయించారు.