కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో రెబెల్ అభ్యర్థి వినోద్ 78 ఓట్ల తేడాతో బీఆర్ఎస్పై విజయం సాధించారు. ఫలితాల అనంతరం అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల ఎదుటనే ఆయనను తీసుకెళ్తున్న వారు పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారి తీస్తోంది. మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో స్వతంత్రుల పై పార్టీలు ఇలా ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
BRS గుర్తు మీద గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వినోద్
ఫలితాల అనంతరం రెబెల్ అభ్యర్థిని ఆటోలో ఎక్కించి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు pic.twitter.com/bV1Zt43Lk5
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2026