BRS Party | ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితిలోకి భారీగా నేతలు చేరుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులపై పెద్ద సంఖ్యలో నేతలు కారెక్కుతున్నారు. తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు కొమురయ్య యాదవ్, సాధుల అంజయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో 50 మంది నీలిబండ తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు వాంకుడోత్ రాజారామ్, మొండ్రాయికి చెందిన ఎండీ లతీఫ్ పలువురి పార్టీలో చేరారు.
గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎండీ మహబూబ్ పాషా, శంషుద్దీన్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కండువాలు కప్పి పార్టీలోకి తెలిపారు. పార్టీ నేతలో చేరిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఇంటింటికి వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.