వనపర్తి : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) నివాస గృహంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సహదేవ్ యాదవ్, ఉప సర్పంచ్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో చందాపూర్ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, నచహళ్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, రీజనల్ అథారిటీ సభ్యుడు ఆవుల రమేష్, క్రమశిక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, యువజన సంఘం అధ్యక్షుడు రాము, నాయకులు బీరయ్య, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.