జనగామ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. వైష్ణవి గార్డెన్స్లో సోమవారం మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా : పల్లా
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణార్థులకు మిషన్లు ఇప్పిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.