నార్కట్పల్లి, మే 27: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. నల్లగొండ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ నార్కట్పల్లిలో పోలింగ్ తీరును పరిశీలించేందుకు వచ్చారు. అప్పుడే నార్కట్పల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నట్టు ఆయనకు సమాచారం అందింది. వెంటనే ఆయన మీడియాతో కలిసి అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించారు. అక్కడ కాం గ్రెస్ నాయకులు అశోక్తోపాటు మీడియా సిబ్బందిపై దాడి చేసి వీడియో రికార్డు చేస్తున్న కెమెరా, ఫోన్లు ధ్వంసం చేశారు. ఈ విషయంపై నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో అశోక్ ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అశోక్తో మా ట్లాడి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో అశోక్కు అధికారులు గన్మన్ను కేటాయించారు