కరీంనగర్ రాంనగర్, మార్చి 26 : నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించి యజమానిని బెదిరింపులకు గురిచేసిన చింతకుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు పిట్టల రవీందర్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ మాదాపూర్లో నివాసం ఉండే పాంరాజ్ దేవీదాస్రావు తండ్రి గోవిందరావుకు చింతకుంటలో కొంత భూమి ఉండగా పహాణీలో మరొకరి పేరు వచ్చింది. ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై కేసు నమోదు కాగా మంగళవారం పిట్టల రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.