హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలైంది. రెండున్నరేండ్ల తన పాలనాకాలంలో కేవలం రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసి తన అశక్తతను వెల్లడించింది. పరిపాలనా అనుమతులు మాత్రం ఘనంగా రూ.7,600 కోట్లకు ఇచ్చిన స ర్కార్.. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు సాగలేదు. ఫలితంగా అతి తక్కువ నిధుల విలువైన పనులే రాష్ట్రంలో జరిగాయి. అవి కూడా కేంద్రం నిధులతో జరిగినవే చాలా వరకు ఉండటం గమనార్హం. ప్రభుత్వం తా జాగా విడుదల చేసిన సోషియో ఎకనమిక్ సర్వే-2026 నివేదికలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 68,709 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 30 జాతీయ రహదారులు కలిపి 1,29,017 కిలోమీటర్ల మేర రోడ్ల నెట్వర్క్ విస్తరించి ఉన్నది.
ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 115.11 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.7,327 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా 1,720 కిలోమీటర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేయాలని, 41 బ్రిడ్జిలు నిర్మించాల ని నిర్ణయించి 253 పనులు మంజూరు చేసిం ది. ఇవికాకుండా గిరిజన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం మరో రూ.275.58 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు ప్లానింగ్ నిధుల కింద రూ.657.83 కోట్లు, ప్రణాళికేతర నిధుల కింద రూ. 276.9 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో రోడ్ నెట్వ ర్క్ అభివృద్ధికి రూ.7,602.58 కోట్లకు సుమా రు రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎకనమిక్ ఔట్లుక్ను బట్టి స్పష్టమైంది.
ప్రచారానికే పరిమితమైన హ్యామ్, ట్రిపుల్ ఆర్
హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) ప్రాజెక్టులో భాగంగా 12,000 కి.మీ. మేర రోడ్ల విస్తరణ, పటిష్టపర్చడం, నిర్వహణ తదితర పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ.12,696 కోట్లతో 6,080 కి.మీ. మేర పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఫేస్-2లో 3,125 కి.మీ, ఫేస్-3లో 2,800 కి.మీ. మేర పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. వీటికి గత ఆరు నెలలుగా ఎటువంటి పురోగతి లేదు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీసి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో ముందుగా ఉత్తర భాగంలో సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లె, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయ్గిరి, తంగడపల్లె (చౌటుప్పల్) వరకు 161.52 కి.మీ. మేర నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
దీన్ని ఎన్హెచ్-161 ఏఏగా నోటిఫై చేసినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి రూ.8,535 కోట్లు ఖర్చవుతుందని, ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతున్నదని తెలిపారు. మోర్త్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించినట్టు చెప్పారు. దక్షిణ భాగం విషయంలో చౌటుప్పల్ నుంచి ఆమన్గల్, సంగారెడ్డి వరకు సుమారు 201 కి.మీ. మేర రోడ్డు నిర్మించేందుకు అలైన్మెంటు రూపొందించి కేంద్రానికి పంపినట్టు తెలిపారు. ఇంతకుమించి ఎటువంటి పురోగతి లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హ్యామ్రోడ్లు, ట్రిపుల్ ఆర్ ప్రాజక్టులను గేమ్చేంజర్గా పదేపదే చెబుతున్నా.. వాటికీ అతీగతీ లేకుండా పోయింది.
కేంద్ర ప్రాజెక్టులు ఇవే..
రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ వివరాలు (కి.మీ.)