Srinivas Goud | రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ సర్కారు ఆగమాగం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. కృష్ణ మండలం హిందూపూర్ బసవేశ్వర కల్యాణమండపంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని మాత్రమే అమలు చేసిందసి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో మరిన్ని దొంగ హామీలతో ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు వస్తారని.. వారిని లెక్కచేయకుండా బీఆర్ఎస్ను ఆదరించి పాలమూరు గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇలాంటి కాంగ్రెస్ పాలనకు.. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు.