హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్( Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాష్టీకానికి ఒడిగట్టారు.
డీజే సౌండ్ తగ్గించాలని కోరితే బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. దాడిలో లాల్గడీ మలక్పేటకు చెందిన పరమేష్తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, దాడి చేయడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు.కాంగ్రెస్ గుండాల దాడిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కారు అద్దం పగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆరాచాకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.