హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గల్ఫ్ కార్మికులను మోసం చేసి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ నాయకులు ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని ఓటర్లను అప్రమత్తం చేస్తూ ‘గల్ఫ్ కార్మిక ద్రోహి.. గప్పాల అరవింద్” అంటూ సోమవారం గాంధీభవన్లో చార్జిషీట్ను విడుదల చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్రెడ్డి, కేరళ ప్రవాసీ కాంగ్రెస్ నేత మునీర్ చార్జిషీట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చార్జిషీట్లో తాము చేసిన అభియోగాలకు సమాధానం చెప్పకుండా.. గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హత అరవింద్కు లేదని గుర్తు చేశారు.