నారాయణ్ఖేడ్: కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు నారాయణ్ఖేడ్లో అభ్యర్థిని మార్పు చేసింది. ముందుగా సురేష్కుమార్ షెట్కార్కు నారాయణ్ఖేడ్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టిన కాంగ్రెస్.. ఇవాళ అతడి స్థానంలో డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
అంతకుముందు ఖేడ్ అభ్యర్థి మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను తెలంగాణ పీసీసీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.