Congress | జడ్చర్ల, అక్టోబర్ 28: జడ్చర్ల కాం గ్రెస్లో ముసలం రాజుకుంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత అనిరుధ్రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్కే టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ వర్గం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఎర్రశేఖర్ అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ముదిరాజ్లకు గెలిచే సీట్లు కాకుండా ఓడిపోయే సీట్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్ రెబల్గా బరిలోకి దిగుతున్నట్టు చెప్పారు. సర్వేలకు వ్యతిరేకంగా టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. మరోమారు సర్వే నిర్వహించి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.