మెదక్ అర్బన్, ఫిబ్రవరి 9 : ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మెదక్ బల్దియాలో ఓటమి తప్పదని గ్రహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ శ్రేణులు, అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలోని 15, 30వ వార్డుల్లో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు, మీడియాకు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించ లేదని ఆరోపించారు.