హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గుండాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. మున్సిపల్ పోలింగ్(Muncipal elections) నుంచి ఎన్నిక వరకు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆరాచకం సృష్టిస్తున్నారు. తమకు బలం లేకున్నా కౌన్సిలర్లను బెదిరించి, దాడి చేసి నిస్సిగ్గుగా తమ వైపు లాక్కుంటున్నారు. తాజాగా జనగామలో దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కరుణాకర్ రెడ్డికాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ పాండు అసభ్యంగా ప్రవర్తించారు.
మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన 8వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంజుల చేయి పట్టి లాగి నీచంగా ప్రవర్తించారు. కరుణాకర్ రెడ్డి, పాండుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.