కరీంనగర్ రాంనగర్, డిసెంబర్ 16: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర సర్కారు కూలిపోతుందని ఆరోపణలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్కు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్.. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఎంపీ సంజయ్ వ్యాఖ్యలు ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతిసేలా ఉన్నాయని, బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సరార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్కి ఎలా తెలిసిందో? ఆధారాలుంటే బహిర్గతం చేయాలని, చేయకుంటే అది కూడా నేరమే అవుతుందని చెప్పారు. దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రను ఛేదించాలని కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ కోరారు. ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో, దాని వెనుక దాగి ఉన్న కుట్రను నివృత్తి చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.