పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ రాచరికపు మాటలు ఎవరూ నమ్మరని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్లో చెత్తదనం తప్ప కొత్తదనమేమీ లేదని ఎద్దేవాచేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ క్లబ్, పబ్ కల్చర్ను తెలంగాణ ఎన్నటికీ అంగీకరించదని తేల్చిచెప్పారు. ఢిల్లీవాసి రాహుల్గాంధీ, గల్లీ సన్నాసి రేవంత్రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు ఎన్నడూ విశ్వసించబోరని స్పష్టంచేశారు. తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ది మొబిలైజేషన్ కమీషన్ల చరిత్ర అయితే, టీఆర్ఎస్ది సోషలైజేషన్ చరిత్ర అని పేర్కొన్నారు.
రాహుల్ వల్లే కాంగ్రెస్ నాశనం: ఎంపీ బడుగుల
రాహుల్ సరైనోడైతే దేశంలో బీజేపీ దాష్టీకాలు ఉం డేవి కావని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నా రు. ఆయన అసమర్థత వల్లే దేశ ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ పార్లమెంట్లో ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రాహుల్ అసమర్థత వల్లే పార్టీ భ్రష్టుపట్టిందని కాంగ్రెస్ సీనియర్లే మొత్తుకొంటున్నారని అన్నారు.
రైతుబిడ్డవైతే పసుపు బోర్డు తే: విద్యాసాగర్రావు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ రైతు బిడ్డే అయితే ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు తేవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు తేడా తెలియని వ్యక్తి ఎంపీగా ఉన్నందుకు నిజామాబాద్ ప్రజలు తలలు పట్టుకొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అర్వింద్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్సీ కవితను ఏకవచనంతో సంబోధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అర్వింద్ తెలివిలేని మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.