హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి పార్లమెంటు బరిలో నిలిచే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి టీ జీవన్రెడ్డి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ చెలిమల సుగుణకుమారి పేర్లను జాబితాలో పేర్కొన్నారు. ఆత్రం సుగుణకు బదులుగా పొరపాటున సుగుణకుమారి పేరు జాబితాలోకి వచ్చిందని పేర్కొంటూ తర్వాత సుగణ పేరుతో మరో జాబితాను విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే 14 మం ది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో నాలుగు, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్లో చెరో మూడు స్థానాలకు కలిపి మొత్తంగా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
పెండింగ్లో ఉన్నవి ఇవే
రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మరో నాలుగు స్థానాలు పెండింగులో ఉన్నాయి. వాటిలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఉన్నాయి. ఈ నెల 31న జరిగే సమావేశంలో ఈ స్థానాలపైనా చర్చించనున్నట్టు తెలిసింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వీటిని పెండింగులో పెట్టినట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సాయంత్రం సీఈసీ సమావేశమైంది.