Minister Ponguleti | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ ఎట్టకేలకు అభ్యర్థులను ఖరారుచేసినట్టు తెలిసింది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో పెడింగ్లో పెట్టింది. తాజాగా, ఈ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రా వు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ వల్లీవుల్లా ను ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వా రా తెలిసింది. శుక్రవారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. కరీంనగర్ జిల్లా కాంగెస్ కమిటీ గురువారం వెలిచా ల రాజేందర్రావుతో మానకొండూరు నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించడం ఈ వార్తలకు ఊతమిస్తున్నది. హైదరాబాద్ విషయంలో ఎంఐఎంతో కుదిరిన లోపాయికారి ఒప్పం దం మేరకు డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది.
పొంగులేటిదే పైచేయి
ఖమ్మం టికెట్ విషయంలో కాంగ్రెస్లో ముక్కోణపు పోటీ కనిపించింది. తన భార్య నందిని కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సోదరుడు ప్రసాద్రెడ్డి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కుమారుడు యుగంధర్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ పోటీలో పొంగులేటిదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు ఖరారైనట్టు తెలిసింది.