MLA Guvvala Balaraju | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు వెళ్తుండగా, వంశీకృష్ణ తన అనుచరులతో తారసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓ వైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్ఎస్పైకి ఉసిగొల్పిన వంశీకృష్ణ, స్వయంగా రాయి తీసి విసిరి కొట్టడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.
తలకు బలంగా తాకటంతో గువ్వల అపస్మారక స్థితికి వెళ్లారు. నుదుటిపై తాకటంతో వాపు వచ్చిందని, పల్స్ పడిపోయాయని వైద్యులు చెప్పారు. ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మొన్నటికి మొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ర్యాలీపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలోని కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాలకుర్తి సభలో అడ్డొచ్చిన కార్యకర్తలను తన్ని గాయపరిచారు. దాడులను రేవంత్రెడ్డి ప్రోత్సహిస్తుండటంతో కార్యకర్తలు సైతం గూండాగిరి ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రె స్ దాడిని ఖండించారు.