జగిత్యాల, జూలై 5:‘‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లను చూడండి.. ప్రాజెక్ట్ మనిగిపోయిందని అన్నారుగా.. ఇప్పుడు ఇక్కడికి అచ్చి చూడండి ఎన్ని నీళ్లువోతున్నయో’ అంటూ జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన రైతు రాజయ్య అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని రాంపూర్పంప్హౌస్ వద్దకు చేరుకొని మోటర్ల నుంచి ఉబికివస్తున్న గోదావరిని చూసి సంబురపడ్డాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘భూమిలో ఇత్తనాలు వేసి, నార్లు పోసుకున్నం.. వానలు లేకపోవడంతో రాత్రింబవళ్లు ఆలోచించిన. కానీ, అన్ని మంచిపనులు జేత్తున్న అపర భగీరథుడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయ్.. మూడు పంపులు చాలైయినయ్.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వాళ్ల మాటలు వినే రైతులు ఇక్కడికి అచ్చి చూడండి.. నీళ్లు ఎంత మంచిగత్తున్నయో.. కాళేశ్వరం మునిగిపోయింది.. అవసరం లేదని అన్న నాయకులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి జూడిన్రి.. ఎన్ని నీళ్లు వోతున్నయో..అంతేగాని అనవసరంగా మాట్లడద్దని నా కోరిక’ అని రైతు రాజయ్య పేర్కొన్నారు.