Minister KTR | ‘మాది బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. మీదే భారత రాబందుల పార్టీ అని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. ఏఐసీసీ (AICC) అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ (All India Corruption Committee) అని మంత్రి అన్నారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని చెప్పారు. ‘స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటినీ ఒంటిచేత్తో ఢీ కొట్టే.. ఢీ టీమ్. బీఆర్ఎస్ ను నేరుగా ఢీ కొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా..? ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మారిటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే. లక్ష కోట్ల వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా..? అర్థం లేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. కర్ణాటకలో ‘అన్నభాగ్య’ హామీని గంగలో కలిపి ఇక్కడ రూ.4వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు..? ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేని వాళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే నమ్మేదెవరు..? కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు. మరో ప్రత్యామ్నాయం లేక ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు. సమర్థత అంతకన్నా కాదు’ అని కేటీఆర్ అన్నారు.
సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోండి అని సూచించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్ జంగల్ జమీన్ అనే మన్యం వీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు.. బీఆర్ఎస్ పార్టీ పాలనలో మన్యానికి మంచిరోజులు అని అన్నారు.
‘తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ బీఆర్ఎస్. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ కాంగ్రెస్. కారు స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలో పదిలం. కానీ, కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండామునిగిన పార్టీ కాంగ్రెస్. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్. మా తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలమే. ఇది చైతన్యానికి ప్రతీకైన.. తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం. బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు..? జాతీయ రాజకీయాలు మీ జాగీరా..? వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ ’ అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..
మీదే భారత రాబందుల పార్టీఏఐసీసీ అంటేనే…
అఖిల భారత కరప్షన్ కమిటీ
All India Corruption Committeeదేశంలో…
అవినీతికి, అసమర్థతకు..
ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్స్కాములే తాచుపాములై..
మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను
దిగమింగిన…— KTR (@KTRBRS) July 2, 2023
Also Read..
Madhya Pradesh | మహిళ అనుమానాస్పద మృతి.. మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్లోనే పెట్టిన భర్త..
Sharad Pawar | కుటుంబంలో సమస్యలు లేవు.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకూ ఆటంకం లేదు : ఎన్సీపీ చీలికపై పవార్
Jack Ma | పాక్లో జాక్ మా రహస్య పర్యటన..!