నల్లగొండ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం పొల్లెపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 80మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. కాంగ్రెస్ దిక్కులేని పార్టీగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతిసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జిల్లా నాయకులు ముద్దం జోగయ్య గౌడ్, ఉప సర్పంచ్ ఈరటి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల రాములు, వార్డు సభ్యులు పిట్టల సాయిలు, ఈరటి చిన్న శేఖర్, కొప్పుల రాములు గౌడ్, నేనావత్ సుమన్, స్టాల్ రాములు, కొప్పుల యాదయ్య, ముత్యాలు, ముద్దం తిరపతయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.