హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆలిండియా క్యాటగిరీలో రాష్ర్టానికి చెందిన సాయిదివ్యతేజారెడ్డి 15వ ర్యాంకు, రిషిశేఖర్ శుక్లా 19వ ర్యాంకు సాధించడం పట్ల ఆకాశ్ ఇనిస్టిట్యూట్ అభినందనలు తెలిపింది. వీరిద్దరూ హైదరాబాద్లోని ఆకాశ్ అందించిన రెండేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశం పొందారని పేర్కొన్నది.